సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 07 మందికి ₹ 71,000/- రూపాయల జరిమానా*
సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో మరియు రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, 07 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా *ఈరోజు సిద్దిపేట 1st అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కుమారి వి. తరణి, గారి ముందు హాజరుపరచగా విచారణ చేసి 07 మందికి ₹ 71,000/- రూపాయల జరిమాన విధించారు*
ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ కుమార్, మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడవదని, మరియు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
*మద్యం సేవించి వాహనాలు నడిపే ఒక్కొక్కరికి 10 వేల రూపాయల జరిమానా విధించడం అమల్లోకి రావడం జరిగిందని తెలిపారు*
కె. ప్రవీణ్ కుమార్
సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్

