సిట్ నోటీసును వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
ముస్తాబాద్ /పున్నమి ప్రతినిధి /ఫిబ్రవరి
మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ గారి పై కక్ష సాధింపు చర్యతోనే సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపిస్తూ ముస్తాబాద్ మండలం లోని గూడూరు గ్రామం లో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని అందులో భాగంగానే హరీష్ రావు, కేటీఆర్కు, కేసీఆర్కు ఫోన్ టాపింగ్ కేసులో సీట్ నోటీసులు పంపిస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ప్రజలను దృష్టి మళ్లించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని మండిపడ్డారు
*ఈ కార్యక్రమం లో BRS పార్టీ సీనియర్ నాయకులు చీటి వెంకటనర్సింగరావు గూడూరు గ్రామ ఉపసర్పంచ్ తాటాకర్ల ప్రభాకర్. 8వ వార్డ్ మెంబర్ పుల్లూరి సంతోష్. కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్ . కేటీఆర్ సేన గ్రామ అధ్యక్షులు చెక్కపెల్లి వెంకటేష్. యూత్ ప్రధాన కార్యదర్శి కోడూరి మనీష్. కేటీఆర్ సేన ఉపాధ్యక్షులు చెరుకు మహేష్. BRS పార్టీ సీనియర్ నాయకులు యూవకులు పాల్గొన్నారు


