కడప జిల్లా..
పులివెందుల
సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడి
ఉలిక్కిపడిన కడప పోలీసు శాఖ..
రూరల్ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్ కుమార్ ఇద్దరినీ సింహాద్రిపురం స్టేషన్ లో విచారిస్తున్న ఏసీబీ అధికారులు.
లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డ సింహాద్రిపురం రూరల్ సీఐ, సింహాద్రిపురం ఎస్ఐ లను అరెస్టు చేసిన ఎసిబి డిఎస్పి .
చైన్ స్నాచింగ్ దొంగతనంలో ఒక ద్విచక్ర వాహనదారున్ని గుర్తించిన పోలీసులు
ద్విచక్ర వాహనం అమ్మిన వ్యక్తి వద్ద నుంచి నాలుగు లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన పోలీసులు..
గత శనివారం లక్ష లంచం రూపంలో అందజేసిన కదిరికి చెందిన ఏజెంట్ బ్రహ్మం..
మిగిలిన డబ్బుకోసం వత్తిడి తేవడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు బ్రహ్మం..
నేడు లక్షన్నర లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడిన పోలీసు అధికారులు..
లంచం సొమ్మును సీజ్ చేసిన ఏసీబీ.
మూడు గంటలుగా సీఐ, ఎస్సై లను విచారిస్తున్న ఎసిబి అధికారులు..
డీఎస్పీ, రూరల్ సీఐ ఆదేశాలతోనే బాధితుడు బ్రహ్మం ను డబ్బులు డిమాండ్ చేసినట్లు ఎస్సై అనిల్ కుమార్ ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం..
కాశ్మీర్ లో చోరీ అయిన టు వీలర్ ను ఏపీలో నెంబర్ ప్లేటు మార్చి విక్రయించిన అక్రమార్కులు..
నెంబర్ ప్లేట్ మార్చిన టు వీలర్ లో చైన్ స్నాచింగ్..
సుమారు 15 లక్షలు చోరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు..
ఈ వ్యవహారంలోనే టు వీలర్ అమ్మిన ఏజెంట్ బ్రహ్మంను డబ్బులు డిమాండ్ చేసిన పోలీసులు..


