
చోడవరం, అక్టోబర్ 12:
శ్రీ శిరిడిసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 100 రోజుల భజన కార్యక్రమంలో భాగంగా 57వ రోజు భజన కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమాన్ని రెడ్డి చందర్రావు, లక్ష్మి దంపతులు తమ నివాసంలో ఏర్పాటు చేశారు. భజన సందర్భంగా భక్తులు సాయినామస్మరణతో గానం చేస్తూ భక్తిరసంలో తేలిపోయారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు.

