కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాక్షి దినపత్రికకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిర్వహించిన నిరసనలో పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ, సాక్షి పత్రికపై కొనసాగుతున్న కక్షపూరిత చర్యలు మీడియా స్వేచ్ఛను అణచివేయాలనే కుట్రలో భాగమని అన్నారు. నకిలీ మద్యం విక్రయాలపై ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు పత్రికను లక్ష్యంగా చేసుకోవడం అసహ్యకరమని ఆయన పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడం దారుణమని అబ్దుల్ రహమాన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సాక్షి దినపత్రికపై నమోదైన కేసులను రద్దు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.సీనియర్ జర్నలిస్ట్ రావుల శంకర్ మాట్లాడుతూ, వార్తలను రాయడమే నేరంగా మలచడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించారు. మీడియా నిజాలు చెబితే భయపెట్టే ధోరణి ఆపాలని ఆయన సూచించారు.నిరసనలో ప్రకాష్ గౌడ్, వారణాసి శ్రీనివాస్, హనమయ్య, సురేష్ చారి, శ్రీధర్, రాధాకృష్ణ చారి, జానకిరామ్, ఆశిష్, గిరిజ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సాక్షి పత్రికపై కక్షపు చర్యలు — మీడియా గొంతు నొక్కే యత్నం: జర్నలిస్టుల ఆగ్రహం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సాక్షి దినపత్రికకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిర్వహించిన నిరసనలో పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ, సాక్షి పత్రికపై కొనసాగుతున్న కక్షపూరిత చర్యలు మీడియా స్వేచ్ఛను అణచివేయాలనే కుట్రలో భాగమని అన్నారు. నకిలీ మద్యం విక్రయాలపై ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చినందుకు పత్రికను లక్ష్యంగా చేసుకోవడం అసహ్యకరమని ఆయన పేర్కొన్నారు.ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేయడం దారుణమని అబ్దుల్ రహమాన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సాక్షి దినపత్రికపై నమోదైన కేసులను రద్దు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.సీనియర్ జర్నలిస్ట్ రావుల శంకర్ మాట్లాడుతూ, వార్తలను రాయడమే నేరంగా మలచడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించారు. మీడియా నిజాలు చెబితే భయపెట్టే ధోరణి ఆపాలని ఆయన సూచించారు.నిరసనలో ప్రకాష్ గౌడ్, వారణాసి శ్రీనివాస్, హనమయ్య, సురేష్ చారి, శ్రీధర్, రాధాకృష్ణ చారి, జానకిరామ్, ఆశిష్, గిరిజ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

