Sunday, 7 December 2025
  • Home  
  • సాంకేతికతయంతో తుఫాను నష్ట నివారణకు చర్యలు చేపట్టాం*
- అమరావతి

సాంకేతికతయంతో తుఫాను నష్ట నివారణకు చర్యలు చేపట్టాం*

* సాంకేతికతయంతో తుఫాను నష్ట నివారణకు చర్యలు చేపట్టాం* *గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టాం* *ఎటువంటి ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేశాం* *రాష్ట్ర హోమ్ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత* అమరావతి,పున్నమి ప్రతినిధి: అత్యాధునిక సమాచార సాంకేతికత సాయంతో ‘మొంథా’ తుపాను నష్ట నివారణకు అన్ని ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందని రాష్ట్ర హోమ్ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం తాడేపల్లి లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరము ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మొంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వం హై అలెర్ట్ గా ఉందన్నారు. గతంలో సంభవించిన తుఫాన్ల సందర్భంగా ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పతిష్టమైన ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి రాష్ట్ర అధికారులతో పలుమార్లు కాన్ఫరెన్స్ లు నిర్వహించి అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఇదే అంశంపై గత నాలుగు రోజుల నుండి రాష్ట్ర ప్రజలను పలు మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తక్షణ చర్యలు చేపట్టేందుకు అన్ని జిల్లాలకు నోడల్ అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. 6 ఎన్ డి ఆర్ ఎఫ్, 13 ఎస్డీ ఆర్ఎఫ్ టీమ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. హెలికాప్టర్ లతో నావెల్ అధికారులను సిద్ధం చేయడం జరిగిందని, అన్నిచోట్ల హెలీపాడ్లను కూడా సిద్ధం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అవసరం అయితే బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ నుంచి కూడా హెలికాప్టర్ లను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. తీరా ప్రాంతాల్లో 14 బోట్లను కూడా సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ తుఫాను సందర్భంగా గంటకు 100 కిలోమీటర్ల పైబడి భారీ గాలులు వీచే అవకాశం ఉన్నందున, ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని రకాల హార్డింగ్లను తొలగించాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. తుఫాను కు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ల టోల్ నెంబర్ కు ఫోన్ చేసి స్పష్టమైన సమాచారం తెలుసుకోవచ్చని, తక్షణ సహాయం కూడా పొందవచ్చు అని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, తక్షణ సహాయం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె విజ్ఞప్తి చేశారు. స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

* సాంకేతికతయంతో తుఫాను నష్ట నివారణకు చర్యలు చేపట్టాం*

*గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు చేపట్టాం*

*ఎటువంటి ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేశాం*

*రాష్ట్ర హోమ్ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత*

అమరావతి,పున్నమి ప్రతినిధి: అత్యాధునిక సమాచార సాంకేతికత సాయంతో ‘మొంథా’ తుపాను నష్ట నివారణకు అన్ని ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందని రాష్ట్ర హోమ్ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఆదివారం తాడేపల్లి లోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరము ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ మొంథా తుపాను నేపథ్యంలో ప్రభుత్వం హై అలెర్ట్ గా ఉందన్నారు. గతంలో సంభవించిన తుఫాన్ల సందర్భంగా ఎదుర్కొన్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పతిష్టమైన ముందస్తు చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎటువంటి ప్రాణ, పశు, ఆస్తి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి రాష్ట్ర అధికారులతో పలుమార్లు కాన్ఫరెన్స్ లు నిర్వహించి అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఇదే అంశంపై గత నాలుగు రోజుల నుండి రాష్ట్ర ప్రజలను పలు మాధ్యమాల ద్వారా అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తక్షణ చర్యలు చేపట్టేందుకు అన్ని జిల్లాలకు నోడల్ అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. 6 ఎన్ డి ఆర్ ఎఫ్, 13 ఎస్డీ ఆర్ఎఫ్ టీమ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. హెలికాప్టర్ లతో నావెల్ అధికారులను సిద్ధం చేయడం జరిగిందని, అన్నిచోట్ల హెలీపాడ్లను కూడా సిద్ధం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. అవసరం అయితే బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్ నుంచి కూడా హెలికాప్టర్ లను తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. తీరా ప్రాంతాల్లో 14 బోట్లను కూడా సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ తుఫాను సందర్భంగా గంటకు 100 కిలోమీటర్ల పైబడి భారీ గాలులు వీచే అవకాశం ఉన్నందున, ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా అన్ని రకాల హార్డింగ్లను తొలగించాలని ఆదేశించినట్లు ఆమె తెలిపారు. తుఫాను కు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ఎవరూ నమ్మవద్దని, అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ల టోల్ నెంబర్ కు ఫోన్ చేసి స్పష్టమైన సమాచారం తెలుసుకోవచ్చని, తక్షణ సహాయం కూడా పొందవచ్చు అని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, తక్షణ సహాయం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆమె విజ్ఞప్తి చేశారు.

స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.