పలమనేరు జూన్12,2020(పున్నమి విలేకరి): పెట్టుబడి లేని సహజ వ్యవసాయ పద్ధతిని అనుసరిద్దాంని వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మీ నాయక్ రైతులకు సూచించారు. శుక్రవారం పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం మండలంలోని గుండుగల్లు రైతు భరోసా కేంద్రంలో ఆయన స్థానిక రైతుల తో సమావేశమై పై విధంగా సూచించారు. మానవాళి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పండించే పంట లో రసాయన ఎరువులను పూర్తిగా తగ్గించి, సహజ సిద్ధి సేంద్రియ ఎరువులు ,జీవామృతం, ఔషధ మొక్కల ఆకుల కషాయం వినియోగించి సాగు పై పెట్టుబడి తగ్గించి మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు. అలాగే వేరుశెనగ విత్తుకొనేందుకు తీసుకొను జాగ్రత్తలపై కూడా ఆయన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట రమణ , మండల వ్యవసాయ అధికారిని హేమలత, విఆర్ఓ కృష్ణ, సచివాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
సహజ వ్యవసాయ పద్ధతిని అనుసరించాలి అనుసరిద్దాం
పలమనేరు జూన్12,2020(పున్నమి విలేకరి): పెట్టుబడి లేని సహజ వ్యవసాయ పద్ధతిని అనుసరిద్దాంని వ్యవసాయ సహాయ సంచాలకులు లక్ష్మీ నాయక్ రైతులకు సూచించారు. శుక్రవారం పలమనేరు నియోజకవర్గం లోని గంగవరం మండలంలోని గుండుగల్లు రైతు భరోసా కేంద్రంలో ఆయన స్థానిక రైతుల తో సమావేశమై పై విధంగా సూచించారు. మానవాళి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పండించే పంట లో రసాయన ఎరువులను పూర్తిగా తగ్గించి, సహజ సిద్ధి సేంద్రియ ఎరువులు ,జీవామృతం, ఔషధ మొక్కల ఆకుల కషాయం వినియోగించి సాగు పై పెట్టుబడి తగ్గించి మంచి దిగుబడులు పొందవచ్చని తెలిపారు. అలాగే వేరుశెనగ విత్తుకొనేందుకు తీసుకొను జాగ్రత్తలపై కూడా ఆయన అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకట రమణ , మండల వ్యవసాయ అధికారిని హేమలత, విఆర్ఓ కృష్ణ, సచివాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

