నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి )
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి గుర్తించిన స్థలంలో సరిహద్దులు నిర్ధారించి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మిర్యాలగూడ మండలం జప్తి వీరప్ప గూడెం వద్ద ఉన్న సర్వే నంబర్ 214 లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ భూమిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ప్రతిపాదించగా, మొత్తం 25 ఎకరాల స్థలంలో పాఠశాల భవన నిర్మాణం చేపట్టెందుకు గాను సరిహద్దులను నిర్ధారించి మ్యాప్ తో సహా పంపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ పవన్, మిర్యాలగూడ తహసిల్దార్ సురేష్ తదితరులు ఉన్నారు.

సరిహద్దులు నిర్ధారించి ప్రతిపాదనలు సమర్పించాలన్న : కలెక్టర్
నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి గుర్తించిన స్థలంలో సరిహద్దులు నిర్ధారించి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె మిర్యాలగూడ మండలం జప్తి వీరప్ప గూడెం వద్ద ఉన్న సర్వే నంబర్ 214 లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ భూమిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణానికి ప్రతిపాదించగా, మొత్తం 25 ఎకరాల స్థలంలో పాఠశాల భవన నిర్మాణం చేపట్టెందుకు గాను సరిహద్దులను నిర్ధారించి మ్యాప్ తో సహా పంపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ట్రైని డిప్యూటీ కలెక్టర్ పవన్, మిర్యాలగూడ తహసిల్దార్ సురేష్ తదితరులు ఉన్నారు.

