శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక సరస్వతి బాయి పాఠశాలలో నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలని చాటుతూ జాతీయ సైన్స్ దినోత్సవ ముందస్తు వేడుకలు అంబరాన్నంటాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ నిర్వహించిన పోటీలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. రంగుల హరివిల్లులో విజ్ఞాన చిత్రాలు సైన్స్ అంటే కేవలం పుస్తకాలు కాదు, అది ఒక కళ అని నిరూపిస్తూ విద్యార్థులు వేసిన సైన్స్ రంగోలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణహిత రంగులతో మానవ శరీర భాగాలు, అంతరిక్ష ప్రయోగాలు మరియు పర్యావరణ రక్షణపై వేసిన చిత్రాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. విద్యార్థుల మేధస్సుకు పరీక్షగా నిలిచిన సైన్స్ క్విజ్ పోటీ అత్యంత ఉత్సాహంగా సాగింది. నాలుగు టీంల మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోరులో విద్యార్థిని హర్షిత బృందం ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు డి.రమేష్ మాట్లాడుతూ..విద్యార్దులకు వైజ్ఞానిక దృక్పథం ఎంతో అవసరం ఉందని 28 ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణకు గుర్తుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని కేవలం చదువుకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక విద్య ద్వారానే విద్యార్థులు గొప్ప స్థాయికి ఎదుగుతారని ఆయన ఆకాంక్షించారు. అనంతరం హర్షిత మాట్లాడుతూ.. తమ ఉపాధ్యాయులు అందించిన లోతైన బోధన, ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించగలిగామని గర్వంగా చాటింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

సరస్వతి బాయి పాఠశాలలో సైన్స్ డే సంబరాలు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 27: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక సరస్వతి బాయి పాఠశాలలో నేటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలని చాటుతూ జాతీయ సైన్స్ దినోత్సవ ముందస్తు వేడుకలు అంబరాన్నంటాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ నిర్వహించిన పోటీలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. రంగుల హరివిల్లులో విజ్ఞాన చిత్రాలు సైన్స్ అంటే కేవలం పుస్తకాలు కాదు, అది ఒక కళ అని నిరూపిస్తూ విద్యార్థులు వేసిన సైన్స్ రంగోలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణహిత రంగులతో మానవ శరీర భాగాలు, అంతరిక్ష ప్రయోగాలు మరియు పర్యావరణ రక్షణపై వేసిన చిత్రాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. విద్యార్థుల మేధస్సుకు పరీక్షగా నిలిచిన సైన్స్ క్విజ్ పోటీ అత్యంత ఉత్సాహంగా సాగింది. నాలుగు టీంల మధ్య హోరాహోరీగా జరిగిన ఈ పోరులో విద్యార్థిని హర్షిత బృందం ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా సైన్స్ ఉపాధ్యాయులు డి.రమేష్ మాట్లాడుతూ..విద్యార్దులకు వైజ్ఞానిక దృక్పథం ఎంతో అవసరం ఉందని 28 ‘రామన్ ఎఫెక్ట్’ ఆవిష్కరణకు గుర్తుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని కేవలం చదువుకే పరిమితం కాకుండా, ప్రయోగాత్మక విద్య ద్వారానే విద్యార్థులు గొప్ప స్థాయికి ఎదుగుతారని ఆయన ఆకాంక్షించారు. అనంతరం హర్షిత మాట్లాడుతూ.. తమ ఉపాధ్యాయులు అందించిన లోతైన బోధన, ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధించగలిగామని గర్వంగా చాటింది. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

