ప్రభుత్వ బాలికల వసతి గృహ బాలిక పై జరిగిన అత్యాచారం ఘటన పై ASWO ను సస్పెండ్ చేయాలని
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని
కలెక్టరేట్ ముందు సీపీఐ – మహిళ సమాఖ్య ధర్నా
సంక్షేమ హాస్టళ్ల బాలికలకు పటిష్ట భద్రత కల్పించాలి*
సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
(రాజమండ్రి -అక్టోబర్ – పున్నమి ప్రతినిధి)
సంక్షేమ హాస్టల్ లో విద్యనభ్యసిస్తున్న బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, కిడ్నాప్ కేసు కూడా పెట్టాలని విద్యార్థినులకు భద్రత కల్పించాలని కోరుతూ సీపీఐ ఆంధ్ర ప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు
ఈ ధర్నాను ఉద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ నగరంలో సంక్షేమ హాస్టల్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన చాలా సిగ్గు చేటు అని ఆయన అన్నారు సంక్షేమ హాస్టల్ లో బాలికలకు రక్షణ కొరవడిందని అన్నారు. బాలిక ఫిర్యాదు చేసేంతవరకు హాస్టల్ hwo, aswo కనీస విచారణ చేపట్టకపోవడం దారుణం అన్నారు.ఘటన పరిశీలిస్తే అనేక అనుమానలు కలుగుతున్నాయని కాబట్టి ఘటన పై సమగ్ర విచారణ జరపాలని, డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంక్షేమ హాస్టల్ లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బాలికలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టల్స్ పై అధికారాల నిఘా కొరవడిందని ఆవేదన వ్యక్తం రాజమండ్రి Aswo స్థానికంగా వుండరని సోమవారం aswo ను సస్పెండ్ చేయాలని మరొక సారి ధర్నా పెడతామని మా పోరాటం ఆగదని అన్నారు
మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య మాట్లాడుతూ ప్రతి మహిళా సంక్షేమ హాస్టల్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అయాన డిమాండ్ చేశారు ఈ ఘటనలో hwo, aswo నిర్లక్ష్యం కనపడుతుందని ఆమె అన్నారు
ఇంకా ఈ కార్యక్రమo లో సీపీ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, ఏఐటీయూసీ నాయకులు రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరావు, జట్ల లేబర్ యూనియన్ కార్యదర్శి సప్ప రమణ, aiyf జిల్లా కార్యదర్శి పి త్రిమూర్తులు, సీపీఐ నగర కార్యవర్గ సభ్యురాలు సేపని రమణమ్మ, టీ నాగేశ్వరావు, ఎస్ నాగమణి జట్ల సంఘం అధికార బాడీ నల్ల రామారావు, పి దేముడు బాబు, రెడ్డి వెంకటరావు బాలకృష్ణ ప్రజానాట్య
మండలి ఉమ, మున్సిపల్ నాయకులు డి దుర్గమ్మ, కాకి శారద, పోలమ్మ, గురి తదితరులు పాల్గొన్నారు


