విశాఖ జిల్లా – గాజువాక (పున్నమి ప్రతినిధి):
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బీహెచ్పీవీ హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో సంవత్సరంగా నిర్వహించనున్న బీహెచ్పీవీ మాజీ ఉద్యోగుల కుమారుల క్రికెట్ టోర్నమెంట్–2026కు సంబంధించిన డ్రా కార్యక్రమం బీహెచ్ఈఎల్ యూనియన్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ టోర్నమెంట్ జనవరి 9, 10, 11, 12 తేదీలలో నిర్వహించనున్నారు.
డ్రా కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు, జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్, స్వచ్ఛ విశాఖ ప్రచారకర్త, ఆంధ్ర విశ్వవిద్యాలయ బోర్డు సభ్యులు ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా హాజరై డ్రా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా మరింత బలపడతారని, ఇలాంటి టోర్నమెంట్లు స్నేహభావాన్ని, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నృత్య కళాకారిణి పల్సర్ ఝాన్సీ, రమేష్ మాస్టర్, బీహెచ్ఈఎల్ యూనియన్ అధ్యక్షులు బోండా బాబూరావు, టెక్కలి భాస్కర్ రావు పాల్గొని నిర్వాహకులను అభినందించారు.
అలాగే ఈ కార్యక్రమంలో జై రాము, ఎం. నాని బాబు, ఎం.ఎన్. కుమార్, పి. శ్రీనివాస్, కె. రవి కుమార్, రాజశేఖర్, సుబేదన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.


