జనవరి 12, అనకాపల్లి జిల్లా పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్: ఎలమంచిలి రూరల్ సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాటలు వంటి చట్టవిరుద్ధ బెట్టింగ్ గేములు నిర్వహించరాదని ఎలమంచిలి రూరల్ పోలీసులు హెచ్చరించారు. రూరల్ ఎస్సై ఉపేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ చందర్రావు పాల్గొన్నారు. “సంక్రాంతి పండగ ముద్దు… కోడిపందాలు వద్దు” అనే నినాదంతో గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. జూదాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని కోరారు.



