టంగుటూరు గ్రామంలో ప్రతి సంవత్సరం సంప్రదాయంగా నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ హజరత్ ఖాదర్ వల్లీ సాహెబ్ వారి 469వ ఉరుసు షరీఫ్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ధార్మిక వాతావరణంలో జరుగుతున్నాయి.ఈ సందర్భంగా టంగుటూరు ముస్లిం కమిటీ పెద్దలు, అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ సాయి లోకేష్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ఈ ఆహ్వాన కార్యక్రమంలో ముస్లిం కమిటీ పెద్దలు వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, షేక్. షావలి,కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్,మంచా మురహరి,కమిటీ సెక్రటరీ షేక్ ఖాదర్ బాషా,షేక్ పూల బాషా, నవీన్ పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ ఉరుసు షరీఫ్ కార్యక్రమం అన్నివర్గాల ప్రజలు పాల్గొనగల సామరస్య, శాంతి,సౌహార్దత సందేశాన్ని తీసుకెళ్తుందని తెలిపారు.అదేవిధంగా,ఉరుసు మహోత్సవం సందర్భంగా వివిధ ప్రార్థనా కార్యక్రమాలు, ఝండా ఉంచడం,ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

శ్రీ హజరత్ ఖాదర్ వల్లీ సాహెబ్ 469వ ఉరుసుకు పార్లమెంట్ అధ్యక్షులు సాయి లోకేష్కు ఆహ్వానం
టంగుటూరు గ్రామంలో ప్రతి సంవత్సరం సంప్రదాయంగా నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ హజరత్ ఖాదర్ వల్లీ సాహెబ్ వారి 469వ ఉరుసు షరీఫ్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ధార్మిక వాతావరణంలో జరుగుతున్నాయి.ఈ సందర్భంగా టంగుటూరు ముస్లిం కమిటీ పెద్దలు, అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ సాయి లోకేష్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో ముస్లిం కమిటీ పెద్దలు వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, షేక్. షావలి,కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్,మంచా మురహరి,కమిటీ సెక్రటరీ షేక్ ఖాదర్ బాషా,షేక్ పూల బాషా, నవీన్ పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ ఉరుసు షరీఫ్ కార్యక్రమం అన్నివర్గాల ప్రజలు పాల్గొనగల సామరస్య, శాంతి,సౌహార్దత సందేశాన్ని తీసుకెళ్తుందని తెలిపారు.అదేవిధంగా,ఉరుసు మహోత్సవం సందర్భంగా వివిధ ప్రార్థనా కార్యక్రమాలు, ఝండా ఉంచడం,ప్రత్యేక ప్రార్థనలు జరుగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

