శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పొయ్య గ్రామంలో శ్రీ సీతారామ మందిర మహాకుంభాభిషేక మహోత్సవంలో ఆదివారం నాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు పాల్గొని శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగినది. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, ఆయన సతీమణి ఎంపీపీ నిర్మలమ్మ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొయ్య గ్రామస్తులు, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ సీతారామ మందిర మహాకుంభాభిషేకంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 08: శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పొయ్య గ్రామంలో శ్రీ సీతారామ మందిర మహాకుంభాభిషేక మహోత్సవంలో ఆదివారం నాడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి దంపతులు పాల్గొని శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగినది. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు, ఆయన సతీమణి ఎంపీపీ నిర్మలమ్మ స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పొయ్య గ్రామస్తులు, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

