ఈ నెల 23వ తేదీన పుట్టపర్తి అధ్యాత్మిక కేంద్రంలో జరగనున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదిన వేడుకలకు రావాలని రాష్ట్ర వెలమ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోలుపర్తి వెంకట గణేష్ కుమార్ (పీవీజీ కుమార్) కి శ్రీ సత్యసాయి సేవా సంస్థల అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కశిరెడ్డి అప్పలనాయుడు శనివారం ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయనతో పాటు జిల్లా సహసమన్వయకర్త కన్నూరు అప్పలనాయుడు, కె.కోటపాడు జె.ఎస్.ఎం. ఫిల్లింగ్ స్టేషన్ యజమాని జూరెడ్డి రాము, మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు సబ్బవరపు పుష్పవతి ప్రతినిధి సబ్బవరపు రామునాయుడు, సబ్బవరం మండల శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఇన్చార్జి కర్రి బంగారు నాయుడు, సాయి భక్తులు చుక్కల జగన్నాధం, బండారు కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.


