* *శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న దక్షిణ నియోజవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి *
* వందేమాతర గీతం నేటితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరితో కలసి గీతాలాపన చేసిన ఎమ్మెల్యే
* ఈరోజు దక్షిణ నియోజవర్గ శాసన సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకొన్నారు. అమ్మవారి గర్భాలయంలో పసుపు, కుంకుమ ,పలు సుగంధ ద్రవ్యాలతో స్వయంగా ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం శ్రీ అమ్మవారికి విశేష పూజ నిర్వహించి, వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదములు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ శోభారాణి గారు, ఏఈఓ ఆనంద్ గారు, ఈ ఈ రమణ, స్థానిక కార్పొరేటర్ నరసింహచారి దంపతులుపలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక కూటమి వార్డ్ అధ్యక్షులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు….


