*_17 జనవరి 1471– 17 అక్టోబర్ 1529_*
*శ్రీకృష్ణదేవ రాయలు (పరిపాలన కాలం: 1509 ఫిబ్రవరి 4–1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి.* *ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు.* *రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ* *సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడినాడు.*
*శ్రీ శ్రీకృష్ణ దేవరాయలు గారి వర్ధంతి సందర్బంగా!!*
*నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని పాత బస్టాండ్ కూదలి వద్ద నియోజకవర్గ కాపు నాడు అధ్యక్షులు గరికిపాటి చంద్ర గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.*
*ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ గారు నివాళులు అర్పించారు.*


