శ్రీ శ్రీ శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో నవంబర్ 22, 2025 (శనివారం)న ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు.
ఉదయం 5.30 గంటలకు స్వామివారికి సుప్రభాతం సేవ నిర్వహించబడుతుంది. అనంతరం 8.30 గంటలకు స్వామివారికి అర్చన కార్యక్రమం జరుగుతుంది.
మధ్యాహ్నం 12.00 గంటలకు అన్నదాన భవనంలో అన్నదానం ఏర్పాటు చేయబడినది.
సాయంత్రం 6.45 గంటలకు ప్రారంభమయ్యే విశేష హారతి రాత్రి 8.15 గంటల వరకు నిర్వహించబడుతుంది.
ఈ పవిత్ర కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి దయాకటాక్షాలు పొందాలని కార్యనిర్వాహణాధికారి తెలియజేశారు.


