మూడవ కార్తీక సోమవారం శుభసందర్భంగా రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి సమేత భుజంగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇన్ఛార్జ్ & KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో దంపతులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు వరలక్ష్మిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, ప్రజలు, భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.


