మూడవ కార్తీక సోమవారం శుభసందర్భంగా చిట్వేల్ పట్టణంలోని శ్రీ భువనేశ్వరి శ్యామలాంబ సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ మరియు భక్తుల ఆహ్వానం మేరకు ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన తీర్థప్రసాదాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు మరియు స్థానిక నాయకులు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో NDA కూటమి నాయకులు, భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.


