శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 21-2-2026 వ తేదీన తెలుగు విభాగం వారు ,అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. డాక్టర్. ఐ .శ్రీనివాస చక్రపాణి గారు, , నెల్లూరు. ముఖ్యఅతిథిగా విచ్చేసి *తెలుగు సాహిత్యం-పోతన కవిత్వం* అనే అంశం మీద వారు మాట్లాడుతూ మాతృభాషను ప్రోత్సహించడం వల్ల భాషా వైవిద్యం అభివృద్ధి చెందుతుందని,బహుభాషా విద్య ప్రోత్సహించబడుతుందని, ప్రపంచవ్యాప్తంగా భిన్న సంస్కృతులపై అవగాహన పెరుగుతుందని భిన్నత్వంలో ఏకత్వం పరస్పరం గౌరవం, విలువలు పెరుగుతాయని తెలిపారు….మాతృభాష ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ పోతన సాహిత్యం ప్రతి ఒక్కరు చదువుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం ,పోస్టర్ ప్రజెంటేషన్ వంటి పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డా.వి.వి.ఎస్ .కుమార్ గారి అధ్యక్షతన జరిగింది. తెలుగు శాఖాధ్యక్షులు డా. కె .సరళ, డా. ఐ .మంజుల మరియు విద్యార్థులు పాల్గొన్నారు….
Uploaded Video:



