Wednesday, 25 March 2026
  • Home  
  • శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలోతెలుగు విభాగం ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి ఉత్సవములు…
- ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలోతెలుగు విభాగం ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి ఉత్సవములు…

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 1.12. 2025 వ తేదీన తెలుగు విభాగం వారు శ్రీమద్ భగవద్గీత సందర్భంగా గీతా సందేశము అనే అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు అధ్యక్షత వహించగా, మధురకవి, మధురస్వరయోగి బిరుదాంకితులు ,శ్రీ వలివేటి వెంకట శివరామకృష్ణమూర్తి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసినారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు భగవద్గీత మానవాళికి ఆదర్శప్రాయమని, భగవద్గీతను అందరూ అధ్యయనం చేయాలని చెబుతూ భగవద్గీత యొక్క ప్రాధాన్యతను వివరించారు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ వలివేటి వెంకట శివరామ కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ గీత సందేశాన్ని అందిస్తూ గీత సు గీత కర్తవ్య శ్రీమద్భగవద్గీత గొప్పతనాన్ని తెలియజేస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన శ్రీమద్రామాయణ, భారత, భగవద్గీతల ద్వారా ఏ సమస్యలున్నా వాటిని అధ్యయనం చేసి అవగతం చేసుకొని ఆచరించినట్లయితే సమస్యల ప్రభావం ఎక్కువగా ఉందని తెలియజేస్తూ మన ఉన్నతికి ఈ గ్రంథాలు ఎంతగానో దోహదం చేస్తాయని అమూల్య సందేశాన్ని వినిపించారు. తదనంతరం విద్యార్థులు గీత పఠ నాన్ని ఎంతో చక్కగా ఆలపించారు. భగవద్గీత శ్లోకాల పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిధులు చేతులు మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్. కె.సరళ, డాక్టర్ .ఐ. మంజుల మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల లో 1.12. 2025 వ తేదీన తెలుగు విభాగం వారు శ్రీమద్ భగవద్గీత సందర్భంగా గీతా సందేశము అనే అంశంపై కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు అధ్యక్షత వహించగా, మధురకవి, మధురస్వరయోగి బిరుదాంకితులు ,శ్రీ వలివేటి వెంకట శివరామకృష్ణమూర్తి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసినారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు భగవద్గీత మానవాళికి ఆదర్శప్రాయమని, భగవద్గీతను అందరూ అధ్యయనం చేయాలని చెబుతూ భగవద్గీత యొక్క ప్రాధాన్యతను వివరించారు.
ఈనాటి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ వలివేటి వెంకట శివరామ కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ గీత సందేశాన్ని అందిస్తూ గీత సు గీత కర్తవ్య శ్రీమద్భగవద్గీత గొప్పతనాన్ని తెలియజేస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు నిలయమైన శ్రీమద్రామాయణ, భారత, భగవద్గీతల ద్వారా ఏ సమస్యలున్నా వాటిని అధ్యయనం చేసి అవగతం చేసుకొని ఆచరించినట్లయితే సమస్యల ప్రభావం ఎక్కువగా ఉందని తెలియజేస్తూ మన ఉన్నతికి ఈ గ్రంథాలు ఎంతగానో దోహదం చేస్తాయని అమూల్య సందేశాన్ని వినిపించారు.
తదనంతరం విద్యార్థులు గీత పఠ నాన్ని ఎంతో చక్కగా ఆలపించారు.
భగవద్గీత శ్లోకాల పోటీలలో గెలుపొందిన వారికి ముఖ్య అతిధులు చేతులు మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డాక్టర్. కె.సరళ, డాక్టర్ .ఐ. మంజుల మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.