శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: తొట్టం బేడు మండలం కత్తి వారి కండ్రిగ దళితవాడలో గుర్రప్ప స్వామి ఆలయ నిర్మాణానికి మాజీ శాసనసభ్యులు ఎస్ సి వి నాయుడు భూమి పూజ నిర్వహించారు. కత్తి వారి కండ్రిక గ్రామంలో శ్రీ గుర్రప్ప స్వామి ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించి ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు సహకారాన్ని అభ్యర్థించారు. నూతన గురప్ప స్వామి ఆలయ నిర్మాణానికి ఎస్సివి నాయుడు తను వంతు సహాయ సహకారాలు అందించారు. సోమవారం ఆలయ నిర్మాణం భూమి పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ సి వి నాయుడు కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ పద్ధతిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఎస్ సి వి నాయుడు చేతుల మీదుగా నిర్వహింపజేశారు. పరమేశ్వరుడు వివిధ రూపాల్లో ఉంటాడని గుర్రప్ప స్వామి పరమేశ్వరునీ ప్రతిరూపమని, గ్రామాలు ఆధ్యాత్మిక చింతనతో వర్ధిల్లాలని అప్పుడే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఎస్ సి వి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.

శ్రీ గుర్రప్పస్వామి ఆలయ భూమిపూజలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీ. వీ.నాయుడు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 23: తొట్టం బేడు మండలం కత్తి వారి కండ్రిగ దళితవాడలో గుర్రప్ప స్వామి ఆలయ నిర్మాణానికి మాజీ శాసనసభ్యులు ఎస్ సి వి నాయుడు భూమి పూజ నిర్వహించారు. కత్తి వారి కండ్రిక గ్రామంలో శ్రీ గుర్రప్ప స్వామి ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించి ఆలయ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే ఎస్ సి వి నాయుడు సహకారాన్ని అభ్యర్థించారు. నూతన గురప్ప స్వామి ఆలయ నిర్మాణానికి ఎస్సివి నాయుడు తను వంతు సహాయ సహకారాలు అందించారు. సోమవారం ఆలయ నిర్మాణం భూమి పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ సి వి నాయుడు కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ పద్ధతిలో ఆలయ నిర్మాణానికి భూమి పూజ ఎస్ సి వి నాయుడు చేతుల మీదుగా నిర్వహింపజేశారు. పరమేశ్వరుడు వివిధ రూపాల్లో ఉంటాడని గుర్రప్ప స్వామి పరమేశ్వరునీ ప్రతిరూపమని, గ్రామాలు ఆధ్యాత్మిక చింతనతో వర్ధిల్లాలని అప్పుడే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ఎస్ సి వి నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.

