పాణ్యం మండలంలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ ఈవో యం.రామక్రిష్ణ ఆధ్వర్యంలో శ్రావణ మాసం ఆఖరు శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల నారాయణ శర్మ, కంపమల్ల సురేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రాతఃకాల పూజలు, గందం అభిషేక పూజలు, రుద్రాభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి కాయకర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం మధ్యాహ్నకాల మహా నివేదన సమయంలో స్వామివారికి సర్ప సూక్తంతో సుగంధ ద్రవ్యాలతో, పంచామృత అభిషేకం, మహా రుద్రాభిషేకం, మహా నైవేద్యం, మహా మంగళహారతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు క్రిష్ణయ్య స్వామి, శివ స్వామి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

శ్రీ కొత్తూరు సుబ్బరాయునిలో చివరి శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు ఆలయ ఈవో యం.రామక్రిష్ణ.
పాణ్యం మండలంలోని కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయ ఈవో యం.రామక్రిష్ణ ఆధ్వర్యంలో శ్రావణ మాసం ఆఖరు శుక్రవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామి వారికి ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల నారాయణ శర్మ, కంపమల్ల సురేష్ శర్మ ఆధ్వర్యంలో ప్రాతఃకాల పూజలు, గందం అభిషేక పూజలు, రుద్రాభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి కాయకర్పూరం సమర్పించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం మధ్యాహ్నకాల మహా నివేదన సమయంలో స్వామివారికి సర్ప సూక్తంతో సుగంధ ద్రవ్యాలతో, పంచామృత అభిషేకం, మహా రుద్రాభిషేకం, మహా నైవేద్యం, మహా మంగళహారతి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు క్రిష్ణయ్య స్వామి, శివ స్వామి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

