శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో సేవా బస్తీ లలో దీపావళి సందర్భంగా టపాకాయలను మరియు స్వీట్స్ ని పంచిపెట్టారు.పాఠశాల సమితి కార్యదర్శి మంగిరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లలలో సేవభావం పెరుగుతుందన్నారు.నైతిక విలువలతో కూడిన విద్య శిశుమందిరాలలో దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించబడిన చాగణం శైలజ దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం చాగణం శైలజ మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని,అష్టైశ్వర్యాలు కలిగించాలని తెలియజేసారు.ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే నినాదంతో ముందుకెళ్లాలని,మట్టి ప్రమీదలలో దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్దతిలో పండుగ జరుపుకోవాలని అన్నారు.వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామికి సేవ చేసుకొనే భాగ్యం కలిగించిన రాష్ట్ర,జిల్లా బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంగిరెడ్డి,చాగణం.భక్తవత్సలయ్య,సుబ్రమణ్యం రెడ్డి,రాజేష్ వర్మ,ప్రకాష్,పాఠశాల మాతాజీలు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీసరస్వతీ శిశు మందిర్ నిర్వహించిన సేవా కార్యక్రమంలో చాగణం శైలజ
శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ఆధ్వర్యంలో సేవా బస్తీ లలో దీపావళి సందర్భంగా టపాకాయలను మరియు స్వీట్స్ ని పంచిపెట్టారు.పాఠశాల సమితి కార్యదర్శి మంగిరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా పిల్లలలో సేవభావం పెరుగుతుందన్నారు.నైతిక విలువలతో కూడిన విద్య శిశుమందిరాలలో దొరుకుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించబడిన చాగణం శైలజ దంపతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం చాగణం శైలజ మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రజల జీవితాలలో వెలుగులు నింపాలని,అష్టైశ్వర్యాలు కలిగించాలని తెలియజేసారు.ఇంటింటా స్వదేశీ ప్రతి ఇంటా స్వదేశీ అనే నినాదంతో ముందుకెళ్లాలని,మట్టి ప్రమీదలలో దీపాలు వెలిగించి సాంప్రదాయ పద్దతిలో పండుగ జరుపుకోవాలని అన్నారు.వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామికి సేవ చేసుకొనే భాగ్యం కలిగించిన రాష్ట్ర,జిల్లా బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంగిరెడ్డి,చాగణం.భక్తవత్సలయ్య,సుబ్రమణ్యం రెడ్డి,రాజేష్ వర్మ,ప్రకాష్,పాఠశాల మాతాజీలు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

