పున్నమి ప్రతి నిధి
తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎంపీ ఈటల రాజేందర్ గారు కుటుంబ సభ్యులతో కలిసి భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఈటల రాజేందర్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు ఎంపీ ఈటల రాజేందర్ గారికి తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


