శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ పట్టాభి రామస్వామి వారి ఆలయంలో జరగనున్న సీతారాముల కళ్యాణోత్సవ ఏర్పాట్లను ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్ రెడ్డి సోమవారం నాడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈఓ భాస్కర్ రెడ్డి ఆలయ అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను కలియతిరిగారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. స్వామివారి కళ్యాణ వేడుకలు కనులపండువగా జరిగేలా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ.. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టాభిరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీరామనవమి వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించిన ముక్కంటి ఆలయ ఈఓ
శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ పట్టాభి రామస్వామి వారి ఆలయంలో జరగనున్న సీతారాముల కళ్యాణోత్సవ ఏర్పాట్లను ముక్కంటి ఆలయ కార్యనిర్వహణాధికారి భాస్కర్ రెడ్డి సోమవారం నాడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈఓ భాస్కర్ రెడ్డి ఆలయ అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను కలియతిరిగారు. కళ్యాణోత్సవానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. స్వామివారి కళ్యాణ వేడుకలు కనులపండువగా జరిగేలా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ.. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టాభిరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

