శ్రీజ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సోమవారం మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ముందుగా వారికి శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరూ తారక శ్రీనివాసులు తదితరులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికారు.అనంతరం ప్రత్యేక రాహు-కేతు పూజ,దర్శనం పూర్తయిన తరువాత వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అలాగే శ్రీకాళహస్తికి ప్రఖ్యాతి గాంచిన కలంకారి కండువాను,స్వామి అమ్మవార్ల కలంకారి చిత్రపటాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
శ్రీజ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని సోమవారం మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.ముందుగా వారికి శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరూ తారక శ్రీనివాసులు తదితరులు దక్షిణ గోపురం వద్ద స్వాగతం పలికారు.అనంతరం ప్రత్యేక రాహు-కేతు పూజ,దర్శనం పూర్తయిన తరువాత వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అలాగే శ్రీకాళహస్తికి ప్రఖ్యాతి గాంచిన కలంకారి కండువాను,స్వామి అమ్మవార్ల కలంకారి చిత్రపటాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

