శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తీశ్వరస్వామి, అమ్మవార్ల దర్శనార్ధం ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి పరిటాల సునీత శుక్రవారం నాడు ఆలయానికి విచ్చేసి లోకపావని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు, స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. పరిటాల సునీత స్వామివారిని దర్శించుకుని, రాహు-కేతు సర్పదోష నివారణ పూజలతో పాటు అభిషేకాల్లో పాల్గొన్నారు. అనంతరం జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. దర్శనానంతరం ఆలయ వెలుపల పరిటాల సునీత మాట్లాడుతూ…రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు లభించాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. ఈ పర్యటనలో పరిటాల సునీత వెంట శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి సభ్యులు వాకుచర్ల గుర్రప్ప శెట్టి, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీ బాబు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో మాజీ మంత్రి పరిటాల సునీత
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తీశ్వరస్వామి, అమ్మవార్ల దర్శనార్ధం ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి పరిటాల సునీత శుక్రవారం నాడు ఆలయానికి విచ్చేసి లోకపావని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని ఆమె దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు, స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. పరిటాల సునీత స్వామివారిని దర్శించుకుని, రాహు-కేతు సర్పదోష నివారణ పూజలతో పాటు అభిషేకాల్లో పాల్గొన్నారు. అనంతరం జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. దర్శనానంతరం ఆలయ వెలుపల పరిటాల సునీత మాట్లాడుతూ…రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు లభించాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. ఈ పర్యటనలో పరిటాల సునీత వెంట శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి సభ్యులు వాకుచర్ల గుర్రప్ప శెట్టి, శ్రీకాళహస్తి టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీ బాబు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

