శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసము సందర్భంగా అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నట్లు ఈ.ఓ బాపి రెడ్డి తెలియజేశారు. కార్తీక మాసంలో శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్ధం అధిక సంఖ్యలో భక్తులు దేవస్థానమునకు విచ్చేయు సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సులభతర దర్శనం కల్పించుటకు ప్రతి కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి రోజున అంతరాలయ దర్శనం నిలుపుదల చేయడమైనదని వారు తెలిపారు.ఈ నెల 22 వ తేదీ నుండి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.కావున భక్తులు సహకరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని కోరడమైనదన్నారు.

శ్రీకాళహస్తీశ్వరాలయంలో అంతరాలయ దర్శనం రద్దు
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసము సందర్భంగా అంతరాలయ దర్శనం రద్దు చేస్తున్నట్లు ఈ.ఓ బాపి రెడ్డి తెలియజేశారు. కార్తీక మాసంలో శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్ధం అధిక సంఖ్యలో భక్తులు దేవస్థానమునకు విచ్చేయు సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సులభతర దర్శనం కల్పించుటకు ప్రతి కార్తీక సోమవారం మరియు కార్తీక పౌర్ణమి రోజున అంతరాలయ దర్శనం నిలుపుదల చేయడమైనదని వారు తెలిపారు.ఈ నెల 22 వ తేదీ నుండి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.కావున భక్తులు సహకరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని కోరడమైనదన్నారు.

