శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెంచారు. మండలంలోని ఉడమలపాడు గ్రామ శివార్లలో రహస్యంగా జూదం (పేకాట) ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు శ్రీకాళహస్తి రూరల్ సీఐ ఇబ్రహీం, ఎస్ఐ వెంకటేశ్ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 8,500 నగదు, 4 సెల్ఫోన్లు, మరియు వారు ప్రయాణించిన 2 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఐ ఇబ్రహీం మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో జూదం, కోడిపందాలు వంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని, ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇలాంటి పనులు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు కోరారు.

శ్రీకాళహస్తి శివార్లలో పేకాట రాయుళ్ల అరెస్ట్- నగదు, బైక్లు స్వాధీనం
శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా పెంచారు. మండలంలోని ఉడమలపాడు గ్రామ శివార్లలో రహస్యంగా జూదం (పేకాట) ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసినట్లు శ్రీకాళహస్తి రూరల్ సీఐ ఇబ్రహీం, ఎస్ఐ వెంకటేశ్ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి రూ. 8,500 నగదు, 4 సెల్ఫోన్లు, మరియు వారు ప్రయాణించిన 2 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. ఈ సందర్భంగా సీఐ ఇబ్రహీం మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలో జూదం, కోడిపందాలు వంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంటుందని, ఎవరైనా ఇటువంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇలాంటి పనులు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు కోరారు.

