శ్రీకాళహస్తి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు జనసేన నాయకులు మున్సిపల్ కమిషనర్ ని కలిసి పట్టణంలోని పలు సమస్యలపై చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఇటీవల కోసం అనేక ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం చేత దోమలు పెరిగి ప్రజలు డెంగ్యూ,మలేరియా వంటి వైరల్ ఫీవర్ల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని మురుగు నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచాలని,శానిటేషన్ క్లీనింగ్ కార్యక్రమాలు తక్షణమే ప్రారంభించాలని అన్నారు.అదేవిధంగా పట్టణంలో కుక్కలు బెడద మరియు పందులు ఎక్కువగా ఉండటంతో పిల్లలు మరియు వృద్ధులు కుక్కల దాడులకు గురవుతున్నారని,పందులు రహదారుల పై సంచరిస్తూ వాహనాలకు అసౌకర్యం కలిగిస్తున్నాయని,అధికారులు స్పందించి ఈ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

శ్రీకాళహస్తి లో మున్సిపల్ కమీషనర్ ను కలిసిన జనసేన నాయకులు
శ్రీకాళహస్తి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు జనసేన నాయకులు మున్సిపల్ కమిషనర్ ని కలిసి పట్టణంలోని పలు సమస్యలపై చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఇటీవల కోసం అనేక ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం చేత దోమలు పెరిగి ప్రజలు డెంగ్యూ,మలేరియా వంటి వైరల్ ఫీవర్ల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని మురుగు నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచాలని,శానిటేషన్ క్లీనింగ్ కార్యక్రమాలు తక్షణమే ప్రారంభించాలని అన్నారు.అదేవిధంగా పట్టణంలో కుక్కలు బెడద మరియు పందులు ఎక్కువగా ఉండటంతో పిల్లలు మరియు వృద్ధులు కుక్కల దాడులకు గురవుతున్నారని,పందులు రహదారుల పై సంచరిస్తూ వాహనాలకు అసౌకర్యం కలిగిస్తున్నాయని,అధికారులు స్పందించి ఈ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

