శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు.శ్రీకాళహస్తి బస్సు డిపో వివిధ ప్రాంతాలకి బస్సు సర్వీసులు పెంచాలని టీడీపీ నాయకులు టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ డీవీ నారాయణ,శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కాసరం రమేష్, వాకచర్ల గురప్ప శెట్టి లు మంగళవారం శ్రీకాళహస్తి డిపో మేనేజర్ చంద్రయ్య ని కలిసి లేఖను ఆయనకి అందించారు. వారు మాట్లాడుతూ చెన్నై నుండి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం కి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారని మధ్యాహ్నం మూడు తరువాత తమిళనాడు డిపోకి బస్సులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.అలాగే,విజయవాడ, నెల్లూరు,నాయుడుపేట ప్రాంతాలకు గతంలో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిచేవని ఇప్పుడు మరల వాటి పునరుద్ధరించాలని డిపో మేనేజర్ ని కోరారు.

శ్రీకాళహస్తి డిపో నుండి బస్సులు పెంచండి
శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు.శ్రీకాళహస్తి బస్సు డిపో వివిధ ప్రాంతాలకి బస్సు సర్వీసులు పెంచాలని టీడీపీ నాయకులు టౌన్ బ్యాంకు మాజీ చైర్మన్ డీవీ నారాయణ,శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కాసరం రమేష్, వాకచర్ల గురప్ప శెట్టి లు మంగళవారం శ్రీకాళహస్తి డిపో మేనేజర్ చంద్రయ్య ని కలిసి లేఖను ఆయనకి అందించారు. వారు మాట్లాడుతూ చెన్నై నుండి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం కి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారని మధ్యాహ్నం మూడు తరువాత తమిళనాడు డిపోకి బస్సులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.అలాగే,విజయవాడ, నెల్లూరు,నాయుడుపేట ప్రాంతాలకు గతంలో ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిచేవని ఇప్పుడు మరల వాటి పునరుద్ధరించాలని డిపో మేనేజర్ ని కోరారు.

