శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించాయి. ప్రఖ్యాత డ్రమ్స్ వాయిద్య కళాకారుడు శివమణి తన అద్భుత ప్రదర్శనతో క్షేత్రాన్ని హోరెత్తించారు. శివతత్వాన్ని ప్రతిబింబించేలా ఆయన సాగించిన వాయిద్య విన్యాసాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. తనదైన శైలిలో డ్రమ్స్ వాయిస్తూ, సంగీతంతో శివనామ స్మరణను ప్రతిధ్వనింపజేసిన శివమణి ప్రదర్శన ఈ వేడుకలకే ప్రత్యేకంగా నిలిచింది. ప్రదర్శన అనంతరం శివమణిని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, బొజ్జల బృందమ్మ, బొజ్జల రిషితా రెడ్డి ఘనంగా సన్మానించారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల జ్ఞాపికను అందజేసి, దుశ్శాలువతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..శివమణి వంటి గొప్ప కళాకారులు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం సంతోషకరమని, వారి సంగీతం భక్తులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, బోర్డు సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో శివమణి సంగీత విన్యాసానికి మంత్రముగ్దులైన భక్తులు
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించాయి. ప్రఖ్యాత డ్రమ్స్ వాయిద్య కళాకారుడు శివమణి తన అద్భుత ప్రదర్శనతో క్షేత్రాన్ని హోరెత్తించారు. శివతత్వాన్ని ప్రతిబింబించేలా ఆయన సాగించిన వాయిద్య విన్యాసాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. తనదైన శైలిలో డ్రమ్స్ వాయిస్తూ, సంగీతంతో శివనామ స్మరణను ప్రతిధ్వనింపజేసిన శివమణి ప్రదర్శన ఈ వేడుకలకే ప్రత్యేకంగా నిలిచింది. ప్రదర్శన అనంతరం శివమణిని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, బొజ్జల బృందమ్మ, బొజ్జల రిషితా రెడ్డి ఘనంగా సన్మానించారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి, జ్ఞానప్రసూనాంబ అమ్మవార్ల జ్ఞాపికను అందజేసి, దుశ్శాలువతో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…..శివమణి వంటి గొప్ప కళాకారులు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం సంతోషకరమని, వారి సంగీతం భక్తులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, బోర్డు సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

