శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టకు అనువైన స్థలం కేటాయించాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంపటి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. రామసేతు వంతెన, క్రొత్త బ్రిడ్జ్ లేదా పట్టణంలోని ప్రధాన సర్కిళ్లలో ఎక్కడైనా స్థలం కేటాయిస్తే, స్వంత నిధులతో పూలే సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ప్రతిష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న దళిత, బహుజన వర్గాల ఆత్మగౌరవం పెంపొందించేందుకు ఈ విగ్రహం అవసరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పూలే విగ్రహాలు ఉన్నప్పటికీ, శ్రీకాళహస్తిలో మాత్రం లేకపోవడం విచారకరమని తెలిపారు. కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్యాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం పూలే చేసిన సేవలు అపారమని గుర్తుచేశారు. పట్టణంలో విగ్రహ ప్రతిష్టకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో దళిత, బహుజన వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు.

శ్రీకాళహస్తిలో పూలే విగ్రహానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్టకు అనువైన స్థలం కేటాయించాలని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంపటి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. రామసేతు వంతెన, క్రొత్త బ్రిడ్జ్ లేదా పట్టణంలోని ప్రధాన సర్కిళ్లలో ఎక్కడైనా స్థలం కేటాయిస్తే, స్వంత నిధులతో పూలే సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ప్రతిష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న దళిత, బహుజన వర్గాల ఆత్మగౌరవం పెంపొందించేందుకు ఈ విగ్రహం అవసరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా పూలే విగ్రహాలు ఉన్నప్పటికీ, శ్రీకాళహస్తిలో మాత్రం లేకపోవడం విచారకరమని తెలిపారు. కుల వివక్ష నిర్మూలన, మహిళా విద్యాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం పూలే చేసిన సేవలు అపారమని గుర్తుచేశారు. పట్టణంలో విగ్రహ ప్రతిష్టకు అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో దళిత, బహుజన వర్గాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు.

