శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని పటాన్ చెరువు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత టి. నందీశ్వర్ గౌడ్ గురువారం సందర్శించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ముందుగా శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరులను దర్శించుకున్న ఆయన, స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ఆయనకు శేషవస్త్రం కప్పి, వాయులింగేశ్వరుని చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పీఆర్ఓ మహేష్ రెడ్డి, ఆలయ అధికారులు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో నందీశ్వర్ గౌడ్ దంపతుల ప్రత్యేక పూజలు
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని పటాన్ చెరువు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత టి. నందీశ్వర్ గౌడ్ గురువారం సందర్శించారు. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. ముందుగా శ్రీ జ్ఞానప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వరులను దర్శించుకున్న ఆయన, స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు ఆయనకు శేషవస్త్రం కప్పి, వాయులింగేశ్వరుని చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పీఆర్ఓ మహేష్ రెడ్డి, ఆలయ అధికారులు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

