. శ్రీకాళహస్తి పట్టణంలోని ఛత్రపతి శివాజీ జంక్షన్ వద్ద శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భారత్ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపకులు సిరిపురం సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మరాఠీ సంఘం ప్రతినిధులు, ఆర్.ఎస్.ఎస్ (RSS) సభ్యులు, హిందూ చైతన్య వేదిక నాయకులు మరియు శివాజీ మహారాజ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత శివాజీ జంక్షన్ వద్ద శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ‘జై శివాజీ.. జై భవానీ’ అంటూ చేసిన నినాదాలతో పట్టణం హోరెత్తింది. భారతీయ వీరత్వానికి, ధైర్యానికి నిలువెత్తు రూపం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని, ఆయన ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖ వక్తలు మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, పరాయి పాలన నుంచి విముక్తి కోసం శివాజీ చేసిన పోరాటం అద్వితీయమని స్వరాజ్య స్థాపన కోసం ఆయన అనుసరించిన వ్యూహాలు ప్రపంచానికే పాఠాలని కొనియాడారు. అనంతరం హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, యువత శివాజీ జీవిత చరిత్రను చదివి దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ ప్రబంధకారిని మంగి రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్ఎస్ఎస్ కండ కార్యవాహ సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ ఖండకారికారిణి, సుమన్ ఖండ కార్యదర్శి, టీవీ మెకానిక్ ప్రసాద్, కోశాధికారి భారత్ ఆర్గనైజషన్ ఆఫ్ సోషల్ సర్వీస్, ఫ్లెక్సీ కృష్ణ రెడ్డి, పసుపులేటి నవీన్, సాగి సతీష్, మొబైల్ షాప్ మహేష్, ఫైనాన్స్ చంద్ర శేఖర్, మరాఠి రాజ శేఖర్, బాబా టెంపుల్ నేతాజీ, కిరణ్ మని, టైలర్ వేణు, పసుపులేటి గిరి, వివిధ సంఘాల నాయకులు, స్థానిక ప్రముఖులు, శివాజీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మిఠాయిలు పంపిణీ చేసి పండుగ వాతావరణంలో జయంతిని జరుపుకున్నారు.

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు- హిందూ ధర్మ రక్షకుడికి ఘన నివాళి
. శ్రీకాళహస్తి పట్టణంలోని ఛత్రపతి శివాజీ జంక్షన్ వద్ద శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. భారత్ ఆర్గనైజేషన్ ఆఫ్ సోషల్ సర్వీస్ వ్యవస్థాపకులు సిరిపురం సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మరాఠీ సంఘం ప్రతినిధులు, ఆర్.ఎస్.ఎస్ (RSS) సభ్యులు, హిందూ చైతన్య వేదిక నాయకులు మరియు శివాజీ మహారాజ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత శివాజీ జంక్షన్ వద్ద శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ‘జై శివాజీ.. జై భవానీ’ అంటూ చేసిన నినాదాలతో పట్టణం హోరెత్తింది. భారతీయ వీరత్వానికి, ధైర్యానికి నిలువెత్తు రూపం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని, ఆయన ఆశయాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పలువురు వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా ప్రముఖ వక్తలు మాట్లాడుతూ.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం, పరాయి పాలన నుంచి విముక్తి కోసం శివాజీ చేసిన పోరాటం అద్వితీయమని స్వరాజ్య స్థాపన కోసం ఆయన అనుసరించిన వ్యూహాలు ప్రపంచానికే పాఠాలని కొనియాడారు. అనంతరం హిందూ చైతన్య వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, యువత శివాజీ జీవిత చరిత్రను చదివి దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సరస్వతి శిశు మందిర్ ప్రబంధకారిని మంగి రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్ఎస్ఎస్ కండ కార్యవాహ సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ ఖండకారికారిణి, సుమన్ ఖండ కార్యదర్శి, టీవీ మెకానిక్ ప్రసాద్, కోశాధికారి భారత్ ఆర్గనైజషన్ ఆఫ్ సోషల్ సర్వీస్, ఫ్లెక్సీ కృష్ణ రెడ్డి, పసుపులేటి నవీన్, సాగి సతీష్, మొబైల్ షాప్ మహేష్, ఫైనాన్స్ చంద్ర శేఖర్, మరాఠి రాజ శేఖర్, బాబా టెంపుల్ నేతాజీ, కిరణ్ మని, టైలర్ వేణు, పసుపులేటి గిరి, వివిధ సంఘాల నాయకులు, స్థానిక ప్రముఖులు, శివాజీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మిఠాయిలు పంపిణీ చేసి పండుగ వాతావరణంలో జయంతిని జరుపుకున్నారు.

