Saturday, 21 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తిలో గంజాయి బ్యాచ్ బరితెగింపు-మార్కెట్ యార్డ్ సిబ్బందిపై పైశాచిక దాడి
- తిరుపతి

శ్రీకాళహస్తిలో గంజాయి బ్యాచ్ బరితెగింపు-మార్కెట్ యార్డ్ సిబ్బందిపై పైశాచిక దాడి

శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో గంజాయి బ్యాచ్‌లు బరితెగిస్తున్నాయి. తాజాగా శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) కార్యాలయంలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపై గంజాయి మత్తులో ఉన్న కొందరు దుండగులు దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తుమ్మ బాల, రాకేష్‌లపై గుర్తు తెలియని గంజాయి బ్యాచ్ ఒక్కసారిగా దాడికి దిగింది. ఏ కారణం లేకుండానే విచక్షణారహితంగా దాడి చేయడంతో బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తసిక్తమైన స్థితిలో ఉన్న వారిని తోటి సిబ్బంది వెంటనే శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు. పట్టణంలో గంజాయి విక్రయాలు, తాగుబోతుల ఆగడాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కూడా రక్షణ లేకపోవడం దురదృష్టకరమని వారు మండిపడ్డారు. నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గంజాయి మహమ్మారిని అరికట్టడంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్ యార్డ్ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను సేకరించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో గంజాయి బ్యాచ్‌లు బరితెగిస్తున్నాయి. తాజాగా శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) కార్యాలయంలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపై గంజాయి మత్తులో ఉన్న కొందరు దుండగులు దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తుమ్మ బాల, రాకేష్‌లపై గుర్తు తెలియని గంజాయి బ్యాచ్ ఒక్కసారిగా దాడికి దిగింది. ఏ కారణం లేకుండానే విచక్షణారహితంగా దాడి చేయడంతో బాధితులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తసిక్తమైన స్థితిలో ఉన్న వారిని తోటి సిబ్బంది వెంటనే శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు. పట్టణంలో గంజాయి విక్రయాలు, తాగుబోతుల ఆగడాలు పెరిగిపోతున్నాయని, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కూడా రక్షణ లేకపోవడం దురదృష్టకరమని వారు మండిపడ్డారు. నిందితులను వెంటనే గుర్తించి, వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గంజాయి మహమ్మారిని అరికట్టడంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కెట్ యార్డ్ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను సేకరించి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.