శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని నగర వీధిలో వెలసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ పట్టాభిరామ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ వేద పండితులు స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణ వేడుక సాగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. అలాగే, ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) వెంకటేశ్వర్లు దంపతులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ – విశాలాక్షి దంపతులు, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, డీఈఓ కృష్ణారెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. భక్తులందరికీ కల్యాణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ పరిసరాలన్నీ ‘జై శ్రీరామ్’ స్మరణతో మారుమోగాయి.

శ్రీకాళహస్తిలో కనులపండువగా సీతారాముల కల్యాణం
శ్రీకాళహస్తి, మార్చి 27 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని నగర వీధిలో వెలసిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ పట్టాభిరామ స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగారు. ఈ సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కనులపండువగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ వేద పండితులు స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణ వేడుక సాగింది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. అలాగే, ఆలయ కార్యనిర్వహణాధికారి (EO) వెంకటేశ్వర్లు దంపతులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ – విశాలాక్షి దంపతులు, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, డీఈఓ కృష్ణారెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయ సిబ్బంది ఈ వేడుకలో పాల్గొన్నారు. భక్తులందరికీ కల్యాణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ పరిసరాలన్నీ ‘జై శ్రీరామ్’ స్మరణతో మారుమోగాయి.

