శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్వదినం సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లకు మంగళవారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి విచ్చేసి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలసి శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మహాశివరాత్రి వేళ తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కూడిన ఈ పట్టువస్త్రాల సమర్పణ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూర్చిందని ఆ ఆదిదంపతుల కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నానాని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆలయ పాలక మండలి చైర్మన్, సభ్యులు, కూటమి నాయకులు పాల్గొని స్వామివార్లను సేవించుకున్నారు.

శివయ్యకు శ్రీనివాసుని పట్టువస్త్రాలు సమర్పణ
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పర్వదినం సందర్భంగా, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లకు మంగళవారం నాడు అత్యంత భక్తిశ్రద్ధలతో టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి విచ్చేసి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో కలసి శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మహాశివరాత్రి వేళ తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో కూడిన ఈ పట్టువస్త్రాల సమర్పణ శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను చేకూర్చిందని ఆ ఆదిదంపతుల కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని తాను ఆకాంక్షిస్తున్నానాని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆలయ పాలక మండలి చైర్మన్, సభ్యులు, కూటమి నాయకులు పాల్గొని స్వామివార్లను సేవించుకున్నారు.

