పున్నమి న్యూస్ ప్రతినిధి
శివనామస్మరణతో పులకించిన నక్కర్త మేడిపల్లి
శివయ్య నామస్మరణతో నక్కర్త మేడిపల్లి పులకించింది.
గ్రామస్థులంతా శివయ్య దర్శనానికి పోటెత్తడంతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి.
సాయంత్రం భక్తులు, పిల్లా పాపలతో మహేశ్వరుడి సన్నిధి కోలాహలంగా మారింది. ఉపవాసదీక్ష విరమించే వారికి ప్రాంగణంలో పండ్లు అందించారు. లింగోద్భవ వేళ వరకు భజనలతో జాగరణ చేయనున్నారు.






