Saturday, 14 March 2026
  • Home  
  • శివనాథపురంలో పోలీసుల కార్డన్ సర్చ్– రికార్డుల్లేని 56 వాహనాలు స్వాధీనం
- తిరుపతి

శివనాథపురంలో పోలీసుల కార్డన్ సర్చ్– రికార్డుల్లేని 56 వాహనాలు స్వాధీనం

తొట్టంబేడు, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోవున్న శివనాథపురం గ్రామంలో శనివారం పోలీసులు విస్తృతంగా కార్డన్ సర్చ్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వజ్రపహర్ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులు, పత్రాలు తదితరాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో రికార్డులు లేని 52 స్కూటర్లు, 4 ఆటో రిక్షాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాల యజమానులు సరైన పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించి వాటికి దూరంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే 1972 లేదా 112 హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీఐలు తిమ్మయ్య, ఇబ్రహీం, నాగరాజు, ప్రకాష్‌తో పాటు ఎస్సైలు వెంకటేష్, రవి, సుబ్బారెడ్డి, జ్యోతి, బాలకృష్ణ, ఇమ్మానుయేల్, హరి ప్రసాద్, స్వాతి, రామాంజనేయులు, గోవిందు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

తొట్టంబేడు, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోవున్న శివనాథపురం గ్రామంలో శనివారం పోలీసులు విస్తృతంగా కార్డన్ సర్చ్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వజ్రపహర్ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులు, పత్రాలు తదితరాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో రికార్డులు లేని 52 స్కూటర్లు, 4 ఆటో రిక్షాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనాల యజమానులు సరైన పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించి వాటికి దూరంగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేశారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, మత్తు పదార్థాల క్రయవిక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే 1972 లేదా 112 హెల్ప్‌లైన్ నంబర్లకు సమాచారం అందించాలని పోలీసు అధికారులు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీఐలు తిమ్మయ్య, ఇబ్రహీం, నాగరాజు, ప్రకాష్‌తో పాటు ఎస్సైలు వెంకటేష్, రవి, సుబ్బారెడ్డి, జ్యోతి, బాలకృష్ణ, ఇమ్మానుయేల్, హరి ప్రసాద్, స్వాతి, రామాంజనేయులు, గోవిందు తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.