

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ పలు ప్రాంతాల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. నక్కవానిపాలెం లక్కీ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో జరుపుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలో పాల్గొన్న మధుర మీనాక్షి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆయా అసోసియేషన్ ప్రతినిధులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. అనంతరం చైతన్య నగర్ లోని హిమాయత్ గౌరీ కనకదుర్గ ఆలయంలో పూజలు చేశారు. కే ఆర్ ఎం కాలనీ లో యూత్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించే పూజల్లో, రమా టాకిస్ వద్ద యంగ్ స్టార్ యూత్ అసోసియేషన్, సీతంపేట వినాయకుని ఆలయం వెనుక సీతంపేట బాయ్స్, దొండపర్తి సంపత్ వినాయక అసోసియేషన్ వద్ద జరుగుతున్న నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆయా కమిటీ ప్రతినిధులు వి.ఎం.ఆర్.డి.ఏ చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ ని సత్కరించి, ప్రసాదం అందజేశారు.

