పున్నమి ప్రతి నిధి
మాలధారుల సౌకర్యార్థం తక్కువ చార్జీలతో శబరిమల యాత్రికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నట్లు ఖమ్మం రీజియన్ మేనేజర్ ఏ. సరిరామ్ తెలిపారు. రీజియన్లోని ఏడు డిపోల నుంచి పుష్బ్యాక్ సీట్లు కలిగిన సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేశారు. ఐదు, ఏడు రోజుల యాత్రలో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట స్వాములకు ఉచిత ప్రయాణం లభిస్తుందని పేర్కొన్నారు. బస్సు బుకింగ్ కోసం ఖమ్మం (99592 25958, 99592 25962), కొత్తగూడెం (99592 25959), భద్రాచలమ్ (99592 25960), మధిర (99592 25961) డిపో మేనేజర్లను సంప్రదించాలని సూచించారు.


