వింజమూరు : పున్నమి న్యూస్ ప్రతినిధి :///
ప్రభుత్వం చేపట్టిన ” స్త్రీ శక్తి “( ఫ్రీ బస్) పథకానికి ఊహించని ఆదరణ వస్తుందని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు. ఇందులో భాగంగా వింజమూరులో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెల్లడించారు. కావున కూటమి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, భారీ సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు.


