తాడేపల్లి – విజయవాడ, అక్టోబర్ 24
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యకలాపాలు రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతున్నాయి. ఈ క్రమంలో పలు కీలక భేటీలు, సమావేశాలు శుక్రవారం విజయవాడ, తాడేపల్లిలో నిర్వహించబడ్డాయి.
తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన వైయస్సార్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ.
తరువాత రాజ్యసభ సభ్యులు, మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆయన గృహమునందు మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటరమణ, ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ముంజేటి కృష్ణమూర్తి, స్టేట్ ఎస్సీ సెల్ సెక్రటరీ లక్ష్మణ్, శ్రీకాకుళం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు గురుమూర్తి తదితరులతో కలిసి భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు.
ఇక విజయవాడలోని సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు టి.జె.ఆర్. సుధాకర్ బాబు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర ఎస్సీ సెల్ సమావేశంలో కూడా రెయ్యి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సామాజిక న్యాయం, ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తత్వసారం ప్రజల సంక్షేమమని, ముఖ్యంగా ఎస్సీ వర్గాల సాధికారత పార్టీ ప్రాధాన్య లక్ష్యమని ఈ సందర్భంలో నాయకులు పునరుద్ఘాటించారు.


