Sunday, 7 December 2025
  • Home  
  • వైభవపేతం గా జరిగిన వాసవి మాత రథోత్సవం
- పశ్చిమ గోదావరి

వైభవపేతం గా జరిగిన వాసవి మాత రథోత్సవం

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, అక్టోబర్ 6 (పున్నమి ప్రతినిధి): తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో గల వాసవి మాత 58వ శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవ వేదంగా జరిగాయి. సోమవారం వాసవి మాతను రాష్ట్రంలోని పురవీధులలో తిరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏకైక వెండి రథం పై అమ్మవారి రథోత్సవ కార్యక్రమం వైభవపీతంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 175 మంది కళాకారులతో, వివిధ వాయిద్య బృందాలతో, సాంప్రదాయం ఉట్టి పడే రీతిగా వీర హనుమాన్, కాళీమాత, వానరమూక, కేరళ వాయిద్య బృందం, బెంగళూరు కళాకారులతో ఊరేగింపు వైభవోపేతంగా జరిగింది. ముందుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గుమ్మడికాయ తో దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్య వైశ్యులు 58 సంవత్సరాలుగా చేస్తున్న ఈ పూజా కార్యక్రమాలు, గత తొమ్మిది సంవత్సరాలుగా వెండి రథోత్సవం నిర్వహించడం చాలా శుభ పరిణామం అని ఆర్యవైశ్యులతో పాటు పట్టణ ప్రజలు అందరూ సుపిష్టంగా ఉండాలని ఆకాంక్షించారు. గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, గత కొంతకాలంగా ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలియజేశారు. శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొర్లబర్ రాము మాట్లాడుతూ మా పెద్దలు మాకు అందించిన గౌరవ మర్యాదలు మా తరువాతి తరాలకు కూడా అందించే రీతిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. రథోత్సవ కమిటీ చైర్మన్ నారాయణ రాంబాబు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి 175 మంది కళాకారులతో ఈ రథోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కార్యదర్శి నున్న సుందర్రావు, కోశాధికారి బొగవిల్లి రమేష్, ఆలయ కార్యదర్శులు ఆలపాటి చిన్న, సత్యనారాయణ, అధిష్టానం, ప్రత్యేక ఆహ్వానితులు, వాసవి క్లబ్ సభ్యులు డైరెక్టర్లు, వనిత క్లబ్, మహిళా సంఘం సభ్యుల సహాయ సహకారాలతో రథోత్సవం పట్టణంలోని ప్రధాన రహదారులకుండా వైభవపెత్తంగా బాణాసంచా నడుమ నిర్వహించారని నిర్వాహకులు తెలియజేశారు. 108 కళాశాలతో అమ్మవారి ఆడపడుచులు పెద్ద సంఖ్యలో రావడం కలశాలు చేతభూని పురవీధుల గుండా వాసవి మాత నామాలతో రథోత్సవంలో పాల్గొన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, అక్టోబర్ 6 (పున్నమి ప్రతినిధి): తాడేపల్లిగూడెం ఏలూరు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో గల వాసవి మాత 58వ శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు వైభవ వేదంగా జరిగాయి. సోమవారం వాసవి మాతను రాష్ట్రంలోని పురవీధులలో తిరిగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏకైక వెండి రథం పై అమ్మవారి రథోత్సవ కార్యక్రమం వైభవపీతంగా జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 175 మంది కళాకారులతో, వివిధ వాయిద్య బృందాలతో, సాంప్రదాయం ఉట్టి పడే రీతిగా వీర హనుమాన్, కాళీమాత, వానరమూక, కేరళ వాయిద్య బృందం, బెంగళూరు కళాకారులతో ఊరేగింపు వైభవోపేతంగా జరిగింది. ముందుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గుమ్మడికాయ తో దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్య వైశ్యులు 58 సంవత్సరాలుగా చేస్తున్న ఈ పూజా కార్యక్రమాలు, గత తొమ్మిది సంవత్సరాలుగా వెండి రథోత్సవం నిర్వహించడం చాలా శుభ పరిణామం అని ఆర్యవైశ్యులతో పాటు పట్టణ ప్రజలు అందరూ సుపిష్టంగా ఉండాలని ఆకాంక్షించారు. గౌరవాధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఐక్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలందరూ స్వాగతిస్తున్నారని, గత కొంతకాలంగా ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలియజేశారు. శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొర్లబర్ రాము మాట్లాడుతూ మా పెద్దలు మాకు అందించిన గౌరవ మర్యాదలు మా తరువాతి తరాలకు కూడా అందించే రీతిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. రథోత్సవ కమిటీ చైర్మన్ నారాయణ రాంబాబు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుండి 175 మంది కళాకారులతో ఈ రథోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని కార్యదర్శి నున్న సుందర్రావు, కోశాధికారి బొగవిల్లి రమేష్, ఆలయ కార్యదర్శులు ఆలపాటి చిన్న, సత్యనారాయణ, అధిష్టానం, ప్రత్యేక ఆహ్వానితులు, వాసవి క్లబ్ సభ్యులు డైరెక్టర్లు, వనిత క్లబ్, మహిళా సంఘం సభ్యుల సహాయ సహకారాలతో రథోత్సవం పట్టణంలోని ప్రధాన రహదారులకుండా వైభవపెత్తంగా బాణాసంచా నడుమ నిర్వహించారని నిర్వాహకులు తెలియజేశారు. 108 కళాశాలతో అమ్మవారి ఆడపడుచులు పెద్ద సంఖ్యలో రావడం కలశాలు చేతభూని పురవీధుల గుండా వాసవి మాత నామాలతో రథోత్సవంలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.