శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి పట్టణంలోని చెన్నై రోడ్డులో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మహా కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాస శుద్ధ పంచమి తిధికి అనుగుణంగా ఆదివారం అన్నడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అశ్విని నక్షత్రయుక్త వృషభ లగ్నంలో మహా కుంభాభిషేక మహోత్సవాన్ని శ్రీ చండికా పీఠం వ్యవస్థాపకులు సింగరాజు ప్రకాశం శాస్త్రి, శ్రీ సింగరాజు బాలసుబ్రహ్మణ్యం శాస్త్రిల ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా వివిధ పూజలు, హోమాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి పరివార దేవతల అష్టబంధనం, దీక్షా హోమం, ప్రతిష్ఠా హోమం, శాంతి హోమం, పౌష్టిక హోమం, నాడీ సందానం, తత్వార్చన, తత్వ హోమం, స్పర్శాహుతి, మహా పూర్ణాహుతి, ప్రాణ ప్రతిష్ఠ, మహా నైవేద్యం అనంతరం మహా కుంభాభిషేకం నిర్వహించారు. కుంభాభిషేకంలో అశేష భక్తజనం పాల్గొని కర్పూర నీరాజనం సమర్పించి, స్వామివారికి పంచ హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని కుంభాభిషేక మహోత్సవాన్ని వీక్షించారు. అనంతరం శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

వైభవంగా శ్రీ షిరిడి సాయి మందిర మహా కుంభాభిషేకం
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 22: శ్రీకాళహస్తి పట్టణంలోని చెన్నై రోడ్డులో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మహా కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాస శుద్ధ పంచమి తిధికి అనుగుణంగా ఆదివారం అన్నడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య అశ్విని నక్షత్రయుక్త వృషభ లగ్నంలో మహా కుంభాభిషేక మహోత్సవాన్ని శ్రీ చండికా పీఠం వ్యవస్థాపకులు సింగరాజు ప్రకాశం శాస్త్రి, శ్రీ సింగరాజు బాలసుబ్రహ్మణ్యం శాస్త్రిల ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా వివిధ పూజలు, హోమాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి పరివార దేవతల అష్టబంధనం, దీక్షా హోమం, ప్రతిష్ఠా హోమం, శాంతి హోమం, పౌష్టిక హోమం, నాడీ సందానం, తత్వార్చన, తత్వ హోమం, స్పర్శాహుతి, మహా పూర్ణాహుతి, ప్రాణ ప్రతిష్ఠ, మహా నైవేద్యం అనంతరం మహా కుంభాభిషేకం నిర్వహించారు. కుంభాభిషేకంలో అశేష భక్తజనం పాల్గొని కర్పూర నీరాజనం సమర్పించి, స్వామివారికి పంచ హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుని కుంభాభిషేక మహోత్సవాన్ని వీక్షించారు. అనంతరం శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

