శ్రీ కాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: మండలంలోని కాట్రపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వైకుంఠనాథ స్వామీ ఆలయంలో అంగరంగ వైభవంగా పూజలు, కోలాటాల నడుమ పురవీధుల్లో ఊరేగింపులతో వేడుకలను నిర్వహించి భక్తులకు తీర్ధ, ప్రసాదాలు, అందజేయడంతో భక్తులు ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని ఆనందానుభూతిని పొందారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వగ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠనాథ స్వామీ వారి ముక్కోటి ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా ఏకాదశి మహోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆయన సతీమణి శ్రీకాళహస్తీశ్వరా స్వామీవారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు కోలా విశాలి నేతృత్వంలో ఏకాదశి వేడుకలను ఘనగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నంద కుమార్, గవర్ల కృష్ణయ్య, కోలా గోవర్ధన్, గ్రామస్తులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీ వైకుంఠనాథ స్వామీవారి ఏకాదశి మహోత్సవం
శ్రీ కాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: మండలంలోని కాట్రపల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వైకుంఠనాథ స్వామీ ఆలయంలో అంగరంగ వైభవంగా పూజలు, కోలాటాల నడుమ పురవీధుల్లో ఊరేగింపులతో వేడుకలను నిర్వహించి భక్తులకు తీర్ధ, ప్రసాదాలు, అందజేయడంతో భక్తులు ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని ఆనందానుభూతిని పొందారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ స్వగ్రామంలో వెలసిన శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠనాథ స్వామీ వారి ముక్కోటి ఏకాదశి రోజున అంగరంగ వైభవంగా ఏకాదశి మహోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఆయన సతీమణి శ్రీకాళహస్తీశ్వరా స్వామీవారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు కోలా విశాలి నేతృత్వంలో ఏకాదశి వేడుకలను ఘనగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నంద కుమార్, గవర్ల కృష్ణయ్య, కోలా గోవర్ధన్, గ్రామస్తులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

