శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,MLC సిపాయి సుబ్రమణ్యం నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలివెళ్లి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా వైకాపా నాయకులూ మాట్లాడుతూ.. పేద ప్రజల వైద్యవిద్య హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టామని పేద, మధ్యతరగతి ప్రజలకు దక్కాల్సిన వైద్య విద్య, వైద్య సేవలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగిందన్నారు. అనంతరం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకుల బృందం ఆర్డీవో కార్యాలయ ఏవోని కలిసి, పేద విద్యార్థులు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ, ఈ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మెమరాండంను సమర్పించారు. ఈ ర్యాలీలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణ ప్రాంతం నుండి భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు,కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

వైద్య విద్య సేవలను ప్రైవేటీకరణను వ్యతెరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ చేపట్టన వైకాపా
శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,MLC సిపాయి సుబ్రమణ్యం నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలివెళ్లి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా వైకాపా నాయకులూ మాట్లాడుతూ.. పేద ప్రజల వైద్యవిద్య హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టామని పేద, మధ్యతరగతి ప్రజలకు దక్కాల్సిన వైద్య విద్య, వైద్య సేవలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగిందన్నారు. అనంతరం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకుల బృందం ఆర్డీవో కార్యాలయ ఏవోని కలిసి, పేద విద్యార్థులు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ, ఈ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మెమరాండంను సమర్పించారు. ఈ ర్యాలీలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణ ప్రాంతం నుండి భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు,కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

